Deputy CM Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి 11 రోజల పాటూ దీక్షను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గత ఏడాది జూన్ నెలలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతగా మళ్ళీ అదే దీక్ష (Varahi Ammavari Deeksha) చేపట్టినట్టు తెలుస్తోంది. దీక్ష సమయంలో పవన్ పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 11 రోజులపాటు దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని తెలుస్తోంది.
Translate this News: