Andhra Pradesh : జగన్‌కు షాక్.. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు.

New Update
Andhra Pradesh : జగన్‌కు షాక్.. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కూల్చివేత

Shock To Jagan : గుంటూరు జిల్లా తాడేపల్లి (Tadepalle) లో నిర్మాణంలో ఉన్న వైసీపీ (YCP) కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు (Demolition). ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయ నిర్మాణం మొదలైంది. కానీ ఇక్కడ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని గతంలో సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో అధికారులు దాన్ని కూల్చివేస్తున్నారు.

Also Read: ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక

Advertisment
తాజా కథనాలు