Arvind Kejriwal: ఈడీ విచారణకు ఈసారి కూడా కేజ్రీవాల్ డుమ్మా

లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టనున్నారు. దీనికి సంబంధించి ఈడీకి ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం గోవా వెళుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని కేజ్రీవాల్ చెప్పారు.

BIG BREAKING: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
New Update

Arvind Kejriwal likely to skip ED summons: వరుసగా నాలుగోసారి కూడా ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. ఇప్పటికే మూడుసార్లు దీన్ని ఎగ్గొట్టిన కేజ్రీవాల్ ఈసారి కూడా హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల కోసం గోవా వెళుతున్న కారణంగా తాను ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఢిల్లీ సీఎం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు రోజుల పర్యటనకు వెళ్ళనున్నారు. గోవాలో (Goa) పార్టీ ముందస్తుగానే కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని...అందుకే వెళ్ళకతప్పడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కేజ్రీవాల్ చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read:గుడివాడలో హై టెన్షన్..ఎన్టీయార్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ vs వైసీపీ

మద్యం కుంభకోణంలో ఆరోపణలు..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Delhi CM Arvind Kejriwal)కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మూడుసార్లు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ ముందుకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఈడీ మరోసారి సమన్లు జారి చేసింది. మద్యం కుంభకోణం కేసులో (Liquor Scam Case) కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగోసారి సమన్లు ​పంపింది. ఈ తాజా సమన్లలో జనవరి 18న ఈడీ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. అంతకుముందు, కేజ్రీవాల్, అతని పార్టీ ఈ మూడు సమన్లను విస్మరించింది, వాటిని చట్టవిరుద్ధమని పేర్కొంది. అటు గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ రూ.338 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.

ఆప్ చుట్టూనే కేసు...
కేజ్రీవాల్‌కు 2022 అక్టోబర్‌లో మొదటి సమన్లు ​జారీ చేసింది ఈడీ. అయితే 2022 ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు. ఇదే కేసులో ఆప్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia), మరో నేత సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా తొమ్మిది గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. అయితే ఇప్పుడు మళ్ళీ మద్యం పాలసీ రూపకల్పన, దానిని ఖరారు చేయడానికి ముందు జరిగిన సమావేశాలు, లంచం ఆరోపణలపై కేజ్రీవాల్‌ను విచారించాలనుకుంటున్నట్లు ఈడీ తెలిపింది. కానీ అవి చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆప్ అంటోంది. కేజ్రీవాల్ ఈడీకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయనను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే సమన్లు ​పంపిందని ఆప్ ఆరోపిస్తోంది.

#aravind-kejriwal #goa #liquor-case #delhi-cm #ed-summons
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి