Ayodhya to Delhi Collapses and Leakages:
అది 2022 జున్ 19, ప్రగతి మైదాన్ సొరంగం ప్రారంభోత్సవం మోదీ చేతుల మీదగా అట్టహాసంగా జరిగింది. రూ.777 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఈ హడావుడి, ఆర్భాటం ఎందుకున్న ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వినిపించడానికి ఎక్కువ కాలం కూడా పట్టలేదు. టన్నెల్ ప్రారంభమైన పది రోజుల్లోనే సొరంగాన్ని వరదలు ముంచేశాయి. పట్టుమని సంవత్సరం తిరగకముందే టన్నెల్ పనికి రాకుండా పోయింది. రూ.777 కోట్ల ధనం వృధా అయ్యింది. గత 10ఏళ్లలో ఈ తరహా ఘటనలు అనేకం జరిగాయని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలా జరుగుతాయని ఆరోపిస్తోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1లో టాప్ రూఫ్ కూలి ఓ వ్యక్తి మరణించడంతో బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. గత 10ఏళ్లలో ఇలాంటి ఘటనలు చాలా జరిగినా బీజేపీ తీరు మారలేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి మల్లి ఖర్జున్ ఖర్గే ఫైర్ అయ్యారు.
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి!
ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలడం, ఒక వ్యక్తి మరణించడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అయెధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ లీకేజీ, జవాన్ల శిబిరాల్లో వరద నీరు, ముంబై అటల్ సేతుపై పగుళ్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Translate this News: