/rtv/media/media_files/2025/08/07/bihar-2025-08-07-09-50-43.jpg)
బీహార్లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. అన్యమతస్థుడితో క్లోజ్ గా ఉందని స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. కటిహార్ జిల్లా ఫల్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రియుడి భార్య పరుగున పోలీస్స్టేషనుకు వెళ్లి సాయం కోరింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ వివాహితులేనని వారికి పిల్లలు ఉన్నవారని, కొంతకాలంగా సంబంధంలో ఉన్నారని అన్నారు. దర్యాప్తు అనంతరం తగిన చర్య తీసుకొంటామని జిల్లా ఎస్పీ శిఖర్ చౌధరి వెల్లడించారు.