Eluru : ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం! AP: ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు. By V.J Reddy 18 Sep 2024 | నవీకరించబడింది పై 18 Sep 2024 09:20 IST in క్రైం Short News New Update షేర్ చేయండి Eluru Rape: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్వామి దయానంద సరస్వతి హాస్టల్ లో బాలికపై అత్యాచారం జరిగింది. స్టూడెంట్స్ ను వార్డెన్ భర్త శశికుమార్ ట్రాప్ చేశాడు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వల వేసుకున్నాడు. ఇటీవల ఓ స్డూడెంట్ను బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. హాస్టల్కు వచ్చిన తర్వాత పేరెంట్స్కు ఈ విషయాన్నీ ఆ స్టూడెండ్ చెప్పడంతో ఈ కీచకుడు చేసిన దారుణ విషయాలు బయటకు వచ్చాయి. శశికుమార్పై ఏలూరు 2 టౌన్లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఈ విచారణలు పోలీసులకు కళ్లు తిరిగే విషయాలు తెలిశాయి. భర్తకు సహకరించాలని విద్యార్థినులపై వార్డెన్ ఫణిశ్రీ ఒత్తిడి చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శశికుమార్కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. భర్తతో పాటు భార్య హాస్టల్ వార్డెన్ పై కేసు నమోదు చేయాలని కోరారు. #women-hostel #eluru-district #rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి