కాలేజీలో ర్యాగింగ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ర్యాగింగ్ బాధను తట్టుకోలేక కొందరు కాలేజీ మానేయడం, చనిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలానే ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది.
ఇది కూడా చూడండి: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ర్యాగింగ్ బాధ తట్టుకోలేక..
ఇక్కడ చదువుతున్న పదో తరగతి విద్యార్థులు జూనియర్స్ను ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో ఆరో తరగతికి చెందిన ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేయగా.. ఆ బాధను తట్టుకోలేక ఎలర్జీ నివారణకు వాడే మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు టీచర్కు చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
ఆశ్రమంలో ర్యాగింగ్ బాధ తట్టుకోలేక విద్యార్థి ఎన్నోసార్లు వార్డెన్కు కూడా చెప్పాడట. అయిన వార్డెన్ కనీసం పట్టించుకోలేదు. కేవలం వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆ్రమ ప్రిన్సిపల్ తెలిపారు.
ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
ఇదిలా ఉండగా ఇటీవల కడప జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి ప్రేమించలేదని యువకుడు కత్తితో పొడిచాడు. కొత్తపల్లిలో షర్మిల అనే అమ్మాయిని కులయప్ప అనే యువకుడు ప్రేమించాడు. అయితే షర్మిల ఆ అబ్బాయిని ప్రేమించలేదు. దీంతో కులయప్ప రెచ్చిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల పై కులయప్ప కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని చూసి కులయప్ప పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం చుట్టుపక్కల వారు, బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు