Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు తిరుమలలో భక్తులను ఒక కారు ఒక్కసారిగా భయపెట్టింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక ఇబ్బంది సమయానికి చేరుకుని మంటలను ఆపడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. By Manogna alamuru 07 Dec 2024 in తిరుపతి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కారు కలకలం రేపింది. ఉన్నట్టుండిగా కారులో మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటల్లో కారు ముందు భాగం మాత్రం పూర్తిగా కాలిపోయింది. అసలేమైంది.. బెంగళూరుకి చెందిన భరత్ కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనానికి కారులో తిరుమలకు వచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి..రాత్రి 9:05 గంటలకు తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. గమ్యం చేరుకున్నాక కారులోంచి పొగలు వస్తున్నాయని భరత్ గమనించారు. దీంతో వెంటే అప్రమత్తమై..కారులో నుంచి అందరినీ కిందికి దింపేశారు. ఆ తరువాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. దాంతో పాటూ కారు రన్ అవడం కూడా ప్రారంభించింది. దీంతో అక్కడ దగ్గరలో ఉన్న భక్తులు భయాందోళనలు చెందారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కారును అదుపులోకి తీసుకోవడమే కాక మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులో ప్రయాణించిన భక్తులు సురక్షితంగా ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. Also Read: Syria: సిరియాలో కల్లోలం..డమాస్కస్ తిరుబాటుదారుల వశం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి