/rtv/media/media_files/2025/09/07/prajwal-revanna-2025-09-07-19-57-31.jpg)
Prajwal Revanna
కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయనకు కొత్త బాధ్యతలను అప్పగించారు. జైలు అధికారులు ఆయనను లైబ్రరీ క్లర్క్గా నియమించారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన ఖైదీలు ఏదో ఓ పని చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఆయనకు ఈ పని అప్పగించారు.
बलात्कार के केस में सजा काट रहा प्रज्वल रेवन्ना जेल की लाइब्रेरी में काम करेगा।
— The Sprite News (@news_sprite) September 7, 2025
जेल प्रशासन ने रेवन्ना की ड्यूटी लाइब्रेरी में लगाई है और काम के बदले उसे 522 रुपए रोज मिलेंगे।
सोचिए गलत काम करने का नतीज़ा कितना खतरनाक होता है,
करोड़ों की गाड़ी और काफिले के साथ चलने वाला आज… pic.twitter.com/jfUPmqiULo
ప్రజ్వల్ రేవణ్ణ తోటి ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి రికార్డ్స్ మెయిన్టైన్ చేయడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ పనికి గాను ఆయనకు ప్రతి రోజు రూ.522 జీతం లభిస్తుంది. సాధారణంగా ఖైదీలు వారానికి కనీసం 3 రోజులు, నెలకు 12 రోజులు పని చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రజ్వల్ రేవణ్ణ కోర్టు విచారణలకు, తన న్యాయవాదులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుండటంతో, ఆయన పని షెడ్యూల్ పరిమితంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
Former Hassan MP #PrajwalRevanna, who is serving a life sentence in connection with a rape case, has been allotted work as a library clerk in Parappana Agrahara prison.https://t.co/LTLVakFCyZ
— The Hindu (@the_hindu) September 7, 2025
గతంలో ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు, లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు శిక్ష పడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన దోషిగా తేలడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
జైలు అధికారులు ఆయన నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ పనిని కేటాయించారు. ఈ నిర్ణయం సమాజంలో భిన్నమైన స్పందనలను రేకెత్తిస్తోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు జైలులో సాధారణ ఖైదీలా పనిచేస్తున్నాడని విని షాక్కు గురైతున్నారు. అయితే, జైలు రూల్స్ ప్రకారం ఇది తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.