/rtv/media/media_files/2025/09/16/kerala-homosexual-2025-09-16-18-35-31.jpg)
kerala Homosexual
కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలుడిపై అత్యాచారం జరిగింది. 16 ఏళ్ల బాలుడిని దాదాపు 14 మంది వ్యక్తులు రెండు సంవత్సరాలకు పైగా లైంగికంగా వేధించారు. చివరికి ఓ రోజు ఆ మైనర్ బాలుడి తల్లి చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం రంగంలోకి దిగి కొందరిని అరెస్టు చేశారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే..
kerala Homosexual
కాసర్గోడ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు LGBTQ కమ్యూనిటీలో ప్రసిద్ధి చెందిన మొబైల్ డేటింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్లో లాగిన్ అయిన తర్వాత అతడికి 14 మంది వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరు కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాల్లోని వివిధ ప్రదేశాలలో ఆ మైనర్ను పిలిచి అతడిపై రేప్ చేశారు. అయితే ఇక్కడ ఆ 14 మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు.
ఇలా రెండు ఏళ్లుగా ఆ మైనర్పై లైంగిక దాడి జరుగుతూనే ఉంది. అయితే బాధితుడి తల్లికి తన కొడుకు కార్యకలాపాలపై అనుమానం వచ్చింది. ఒకరోజు ఆమె తన ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని తన కొడుకుతో చూసింది. ఆ సమయంలో ఆ అపరిచితుడు ఆమెను చూసి పారిపోయాడు. దీంతో తల్లి తన కొడుకును కఠినంగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని మొత్తం అతడు తన తల్లికి వివరించాడు.
వెంటనే ఆమె చైల్డ్లైన్కు సమాచారం అందించగా.. వారు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత బాలుడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. దీని ఆధారంగా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 కింద 14 ప్రత్యేక కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నిందితుల్లో అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూత్ లీగ్ కార్యకర్త ఉన్నారు. నిందితులందరూ 25 నుంచి 51 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని పోలీసులు తెలిపారు.