/rtv/media/media_files/2025/04/30/ce2IsmZE47cwn8dDVQmN.jpg)
Hyderabad Groom suicide of friend murder fear
Viral Crime: తెలంగాణలో మనసు తల్లడిల్లే ఘటన జరిగింది. సికింద్రాబాద్ వారాసిగూడలో విషాద సంఘటన స్థానికులతోపాటు జనాలను కలవరపెట్టింది. మరో నాలుగు రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకున్న యువకుడు.. తన ఫ్రెండ్ మరణం తట్టుకోలేక దారుణానికి పాల్పడ్డాడు. ప్రాణ స్నేహితుడు తనకు దూరమయ్యడనే దుఃఖంతోపాటు కళ్లముందే జరిగిన ఘోరం చూడలేక భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మందు పార్టీలో మర్డర్..
ఈ మేరకు వారసిగూడ బౌద్ధనగర్కు చెందిన మోహన్ కృష్ణ బైక్ మెకానిక్గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలే మోహన్ కు పెళ్లి సంబంధం కుదరగా మే 4న నిశ్చితార్థం నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27న రాత్రి మోహన్ తన స్నేహితులు శ్యాంసన్ రాజు, మరికొంతమందితో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. అయితే పార్టీలో మద్యం మత్తులో ఉండగానే శ్యాంసన్ రాజు, అతని బావ లూథరస్ మధ్య వివాదం మొదలైంది. మాటమాట పెరిగి దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. విచక్షణ కోల్పోయిన లూథరస్.. రాజుపై ఇనుప రాడ్తో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో రాజు అక్కడికక్కడే చనిపోయాడు.
Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
అయితే ఈ దారుణం కళ్లారా చూసిన పెళ్లి కొడుకు మోహన్ కృష్ణ.. తట్టుకోలేకపోయాడు. తనను ఈ కేసులో సాక్షిగా చేరుస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందని ఒత్తిడికి లోనయ్యాడు. క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి కావాల్సిన మోహన్ ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Also Read: BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
murder | friend | engagement | telugu-news | today telugu news