/rtv/media/media_files/2025/06/20/childrens-kill-2025-06-20-20-16-04.jpg)
మేఘాలయలో హనీమూన్ కు అని తీసుకువెళ్లి కట్టుకున్న భర్తను సోనమ్ అనే మహిళ ప్రియుడితో కలిసి చంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే మరో దారుణమైన యూపీలోని ముజఫర్నగర్లో వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి హనీమూన్కి వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కలి గ్రామంలో 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్కి వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలను అడ్డంకిగా మారుతారని భావించి వారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ముస్కాన్ ను అరెస్టు చేశామని, ఆమె ప్రేమికుడు జునైద్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
హత్యలో తల్లి ప్రమేయం
ముస్కాన్ ఇద్దరు పిల్లలు, కుమారుడు అర్హాన్, కుమార్తె ఎనయ ఉన్నారు. గురువారం వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు. దర్యాప్తులో ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందని తేలింది, ఆమెను అదుపులోకి తీసుకున్నామని, విచారణలో ఆమె నేరం అంగీకరించిందన్నారు. తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించాడని తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని, వారికి విషం ఇచ్చి చంపానని ముస్కాన్ చెప్పిందని వెల్లడించారు. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట హనీమూన్ కి వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. ముస్కాన్ చాలా కాలంగా జునైద్ తో అక్రమ సంబంధంలో ఉంది. ఆమె భర్త వసీం ప్రస్తుతం చండీగఢ్ లో పనిచేస్తున్నాడు.