/rtv/media/media_files/2025/06/02/Dq4KEhRt3HO80OdxiSPj.jpeg)
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద కారు, -ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ కావడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
east-godavari-district | kakinada | road-accident | latest-telugu-news | car-accident