/rtv/media/media_files/2025/06/27/tadipatri-2025-06-27-12-55-13.jpg)
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో శుక్రవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బోడాయిపల్లి గ్రామంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. నడిపి కుల్లాయప్ప వరి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఒకేసారి 6 మంది దాడికి దిగారు. కుల్లాయప్ప తరపు కూడా మరి కొందరు ఎదురుదాడికి వచ్చారు. దీంతో ఘర్షణలో ఐదుగురి తీవ్రగాయల పాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.