/rtv/media/media_files/2025/11/01/bengaluru-woman-2025-11-01-06-46-12.jpg)
ఈడొచ్చిన కూతురికి ఓ తల్లి మంచి చెడులు గురించి చెప్పడమే తప్పు అయిపోయింది. యువకులతో తిరగొద్దని ఆమె చెప్పిన మందలింపులు కోపాన్ని తెచ్చాయి. దీంతో ఆ కోపాన్ని తట్టుకోలేక కన్న తల్లిని తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి చంపేసింది. ఈ దారుణమైన ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ మహిళ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులుకు ఈ భయకంరమైన విషయం తెలిసింది. మృతురాలిని బెంగళూరులోని సుబ్రమణ్యపుర సమీపంలోని ఉత్తరహళ్లి నివాసి 34 ఏళ్ల నేత్రావతిగా గుర్తించారు. నేత్రావతి తన 15 ఏళ్ల కుమార్తె (9వ తరగతి డ్రాపౌట్), ఆమె స్నేహితులతో ముఖ్యంగా ఆమెకు ఉన్న 17ఏళ్ల బాయ్ఫ్రెండ్తో సంబంధాన్ని వ్యతిరేకించేవారు.
కూతురు స్నేహితులు తరచుగా ఇంటికి రావడం ఆమెకు నచ్చేది కాదు. కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె తల్లి ఇటీవల తీవ్రంగా మందలించింది. ఇది అవమానంగా భావించిన బాలిక తల్లిపై పగ పెంచుకుంది. తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి చంపేయాలని ఫిక్స్ అయింది. అక్టోబరు 25న 17 ఏళ్ల లోపు వయస్సున్న నలుగురు స్నేహితులను తన ఇంటికి పిలిపించుకుంది. పక్క గదిలో నిద్రపోతున్న బాలిక తల్లి పిల్లల విపరీత నవ్వులకు లేచింది. లోపలికి వెళ్లి చూడగా.. నలుగురు అబ్బాయిలతో తన కూతురుఅభ్యంతరకర స్థితిలో ఉన్నట్లుగా గుర్తించి మరోసారి మందలించింది. అప్పటికే ఆమెను చంపేయాలని ఫిక్స్ అయిన ఆ నలుగురు మైనర్ బాలుర్లు నోటిని మూసి, గొంతుకు తువ్వాలుతో బిగించి హత్య చేశారు.
ఆత్మహత్యగా క్రియేట్ చేసి
అనంతరం దీనిని ఓ ఆత్మహత్యగా క్రియేట్ చేసి తప్పించుకోవాలని అనుకున్నారు. మృతదేహాన్ని చీరతో ఫ్యాన్కు కట్టి వేలాడదీశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే మరునాడు ఇంటికి వచ్చిన ఆమె సోదరి చూసి షాక్ అయింది. మృతదేహాన్ని గుర్తించి, స్థానికులు, బంధువుల సాయంతో అంత్యక్రియలు జరిపించింది. అయితే తల్లి చనిపోయిందని తెలిసినప్పటికీ కూతురు అంత్యక్రియలకు హాజరు కాకాపోవడం పట్ల పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా 15 ఏళ్ల అసలు నిజాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు బాలిక సహా నలుగురు బాలలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Follow Us