/rtv/media/media_files/2025/06/29/adilabad-2025-06-29-10-05-54.jpg)
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికలు, యువతులను రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పిల్లలు లేని కుటుంబాలకు అప్పగిస్తామని, బాగా చదివించి, పెళ్లి చేస్తారని నమ్మించి వల వేస్తున్నారు. ఆదివాసీ యువతిని ఇలాగే తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో రూ.1.30 లక్షలకు విక్రయించాడు. ఆమె ఆధార్ కార్డులో ఫోన్ నంబరు మార్చి అప్ డేట్ చేయడంతో అది పోస్టులో ఇంటికి రావడంతో గుట్టు బయటపడింది.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
ఈ దందాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర ఉండటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ బాలికను తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. మరో యువతిని మధ్యప్రదేశ్లో రూ.1.10 లక్షలకు విక్రయించినట్లు తేలింది. మహారాష్ట్ర కిని గ్రామానికి చెందిన ఆత్రం నిర్మల, బాపుణ్య భార్యాభర్తలు. వీరు ఆదిలాబాద్ జిల్లాకు కూలి పనులకోసం వచ్చారు. ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేని బంధువుల బాలిక (16)ను నెమ్మదిగా మచ్చిక చేసుకున్నారు. మహారాష్ట్రకు పండగ ఉందని చెప్పి తీసుకెళ్లి రాజస్థాన్లో రూ. 10 వేలకు అమ్మేశారు. కరణ్ అలియాస్ భగవత్ అనే వ్యక్తి బాలికను పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
అయితే బాలికల ఆచూకీ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది. పాత వేడుక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా.. రాజస్థాన్లో ఉన్న బాలిక లైక్ చేయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై పోలీసులు పోక్సో, మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసి.. బాలికను విక్రయించిన భార్యాభర్తలను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా పరిశోధనలో రుజువైందని పోలీసులు తెలిపారు. ఈ దందాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందరినీ పట్టుకుంటామని అధికారుల తెలిపారు.