దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితి, చదువులో ఒత్తిడి ఇలా అనేక రకాల కారణాలతో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా కర్ణాటకాలోని కోడుగు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ దంపతులు తమ కూతురు(11)తో పాటు ఓ రిసార్టులో ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే తాము ఆత్మహత్యే చేసుకుంటున్నామని ఓ నోటు కూడా ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు వినోద్ (43), అతని భర్య జుబీ అబ్రహం (37), కుమార్తె జోహన్ (11)గా గుర్తించారు. ఓ ప్రైవేట్ రిసార్టు గదిలో వారి మృతదేహాలు దొరికాయి.
పూర్తిగా చదవండి..Crime News: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే..
కర్ణాటలోని కొడుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ దంపతులు తమ కూతురు(11)తో కలిసి ఓ రిసార్ట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్న ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. బాధితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
Translate this News: