Vijayashanti: బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్(Congress)లో చేరానని విజయశాంతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో కాంగ్రెస్ విడిచి బీజేపీ(BJP)కి వెళ్ళడానికి కారణం చెప్పారు. అవినీతి పరుడైన కేసీఆర్ను జైల్లో వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందని, ఆ కారణంగానే బీజేపీలో చేరామన్నారు. నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మోడీ, అమిత్ షా, నడ్డా.. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అవినీతిపరుడని, కుటుంబ పాలన చేస్తున్నారని కామెంట్స్ చేశారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు విజయశాంతి.
పూర్తిగా చదవండి..Telangana: అతని వల్లే సంజయ్ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు విజయశాంతి. వీరి ఆటలో జనాలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులే పిచ్చోళ్లయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పంపిన ఓ నాయకుడి వల్లే బండి సంజయ్ పదవి పోయిందని ఆరోపించారామె. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్నందునే ఆ పార్టీని వీడానన్నారు.
Translate this News: