BR Ambedkar : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : మల్లు రవి

కరెన్సీ నోట్లపై డా.అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్‌ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అంబేద్కర్ ఫొటో సాధన సమితి నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన.. భారత రాజ్యాంగం, రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు మూలకారణమైన ఆయన ఫొటోను కరెన్సీపై ముద్రించాలన్నారు.

BR Ambedkar : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : మల్లు రవి
New Update

Mallu Ravi : కాంగ్రెస్(Congress) నేత మల్లు రవి(Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్ల(Currency Notes) పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్‌ కోసం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అంబేద్కర్ ఫొటో సాధన సమితి ధర్నా నిర్వహించింది. సమితి అధ్యక్షుడు జరిపోతుల పరశురామ్‌ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఢిల్లీ(Delhi) లో తెలంగాణ(Telangana) ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, తెలంగాణ ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read:రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 20 ఎకరాల్లో డ్రోన్‌ పోర్ట్‌!

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ ఫొటో ముద్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు మూల కారణం అంబేద్కరేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఫొటోను కరెన్సీపై ముంద్రించాలని కోరారు.

Also Read: 2లక్షల ఉద్యోగాలిస్తాం.. రేవంత్‌రెడ్డి సంచలన హామీ!

#br-ambedkar #telugu-news #currency-notes #mallu-ravi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe