Khammam MP Ticket : పార్లమెంటు ఎన్నిక(Parliament Elections) లకు అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తోంది. కాంగ్రెస్(Congress) కూడా కొంత మంది పేర్లను ఖరారు చేసేసింది. కానీ ఖమ్మం(Khammam) పార్లమెంటు అభ్యర్ధి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇక్కడ సీటు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చేతులెత్తేయడంతో… విషయం ఢిల్లీ పెద్దల చేతికి వెళ్ళింది. ఖమ్మం సీటు కోసం భట్టి భార్య ప్రయత్నిస్తున్నారు. అలాగే పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి కుటుంబ సభ్యులకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం మీదన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర క్యాబినెట్లో హోదాను అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇవ్వడమేంటని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భట్టి భార్యకు టికెట్ ఇవ్వకుండా పొంగులేటి గట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana : ఇంకా ఖరారు కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి..చక్రం తిప్పుతున్న పొంగులేటి
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ దీని వెనుక మాత్రం చాలా రాజకీయాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఒకరి మీద ఒకరు పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎవరూ ఊహించని అభ్యర్ధి పేరు వినిపిస్తోంది.
Translate this News: