CM Jagan on AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు జగన్ సర్కార్ను గద్దె దించాలని టీడీపీ-జనసేన (TDP-Janasena)పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ‘సిద్ధం’ (Siddham) అనే పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. బహిరంగ సభల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. విపక్ష పార్టీల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.
పూర్తిగా చదవండి..CM Jagan: 45 రోజులు కష్టపడితే అధికారం మనదే
45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారని.. పెద్దగా మార్పులు ఉండవన్నారు.
Translate this News: