CM Revanth Reddy: హైదరాబాద్ వయా మిర్యాలగూడా- విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో (Piyush Goyal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ వినతి..
హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు తుది అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయాల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రానికి ఎన్డీసీ, మెగా లెదర్ పార్క్, ఐఐహెచ్టీలను మంజూరు చేయాలని అభ్యర్థించారు.
Translate this News: