DRDO : శత్రుదేశాల వెన్నువణుకు పుట్టించేందుకు సైన్యం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ‘జోరావర్'(‘Zorawar’) ఆర్మీ బలాన్ని మరింత పెంచబోతోంది. ఈ లైట్ ట్యాంకుల అభివృద్ధి ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దీనిని తదుపరి పరీక్ష కోసం ఏప్రిల్ నాటికి భారత సైన్యానికి అప్పగించవచ్చు. ఈ మేరకు రక్షణ శాఖ(Department of Defense) అధికారులు సమాచారం అందించారు. 59 జొరావర్ లైట్ ట్యాంకుల ఉత్పత్తి, సరఫరా కోసం సైన్యం DRDOకి ఆర్డర్ ఇచ్చింది. లార్సెన్ & టూబ్రోతో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు.రక్షణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘లైట్ ట్యాంక్(Light tank)ను కొత్త ఇంజన్తో తయారు చేసే పనులు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రవాణా చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భారత సైన్యానికి అందజేయాలని భావిస్తున్నారు. 59 జొరావర్ లైట్ ట్యాంకుల(Zorawar Light Tanks) ఉత్పత్తి, సరఫరా కోసం సైన్యం DRDOకి ఆర్డర్ ఇచ్చింది. లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro) సహకారంతో వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..DRDO : చైనాకు చెమటలు పట్టించే ఆయుధం.. సైన్యానికి DRDO నుంచి మరో అస్త్రం!
శత్రుదేశాలకు ముచ్చెమటలు పట్టించేందుకు లైట్ ట్యాంక్ జోరావర్ అభివృద్ధి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తదుపరి పరీక్షల కోసం DRDO వాటిని ఆర్మీకి అప్పగించవచ్చు. ఏప్రిల్ నాటికి వీటిని అప్పగించనుంది. భారత సైన్యం 59 జోరావత్ ట్యాంకుల ఉత్పత్తికి ఆదేశించింది.
Translate this News: