/rtv/media/media_files/2025/02/24/J1d1MMIxGJVPGy7jTRCV.jpg)
celebrities off to dubai
Tollywood Celebrities: మెగాస్టార్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల ఫ్యామిలీస్ ప్రస్తుతం దుబాయి లో ఓ ప్రైవేట్ వెడ్డింగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత షేర్ చేసిన ఫోటోల ద్వారా వీరంతా దుబాయ్ లోనే ఉన్నట్లు తెలిసింది. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, తారక్, అఖిల్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీస్ కూడా ఆ వెడ్డింగ్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ పెళ్లి ఎవరిది..?
దీంతో ఇంతకీ ఆ వెడ్డింగ్ ఎవరిదీ? ఇంతమంది ప్రముఖులు వెళ్ళడానికి కారణమేంటి? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రముఖ నిర్మాత, AMR గ్రూప్ ఛైర్మెన్ మహేష్ రెడ్డి కుమారుడి వివాహం కోసమే సెలెబ్రెటీలు అంతా దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిర్మాత మహేష్ రెడ్డి నాగార్జునతో షిర్డీ సాయి, వెంకటేష్ తో ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాలను నిర్మించారు. అలాగే ఆయనకు తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో గ్రాండ్ జరుగుతున్న ఆయన కుమారుడి పెళ్ళికి స్టార్ హీరోల కుటుంబాలంతా అటెండ్ అయ్యారు.
నమ్రత ఓ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కీర్తి, నితేష్ తమ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాము అంటూ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలను, వీడియోలను పంచుకుంది. ఇందులో రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతీ, అమల, సితార, సుకుమార్ కూతురు సుకృతి, అనిరుద్ తదితరులు ఉన్నారు.
Also Read: MAZAKA Trailer: బాలయ్య బాబు ప్రసాదం.. జై బాలయ్య.. 'మజాకా' ట్రైలర్ చూశారా?