Telusu Kada: తెలుగు ప్రేక్షకుల కోసం మరో కొత్త ప్రేమకథ రానుంది. ‘తెలుసు కదా’(Telusu Kada Movie) అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాతో ప్రముఖ సెలెబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారుతున్నారు. ఇది ఆమెకు తొలి సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంలో సిద్ధు జొన్నాలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.
సినిమాలో కొత్త ట్విస్ట్
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాయింట్ను టచ్ చేశాం. అయితే ఇప్పుడే ఆ విషయం చెప్పలేం. సినిమా చూడగానే ఆ విషయం తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు,” అంటూ ఆసక్తిని పెంచింది. అలాగే, ఈ సినిమా మొత్తం చూసే వరకు అసలు ఆ కీలక అంశం ఏమిటో తెలుసుకోలేమని చెప్పింది.
అలాగే, ‘తెలుసు కదా’లో అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి. కామెడీ, ప్రేమ, భావోద్వేగం.. అన్నీ సమపాళ్లలో ఉండేలా కథను రూపొందించారట. సినిమా అంతా ప్రేక్షకులకు సరదాగా సాగిపోతూ, చివరకు మంచి ఫీల్ని ఇస్తుందని చెప్పింది.
ఈ సినిమా తేలికగా అర్థమయ్యే కథతో సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. భావోద్వేగాలు మరీ ఎక్కువగా కాకుండా, మెల్లగా మనసును తాకేలా చూపించనున్నారట. ముఖ్యంగా యువతకు నచ్చేలా కథ, సంభాషణలు ఉంటాయని సమాచారం.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీ.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాకి సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఆయన సంగీతం ఇప్పటికే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని చిత్రబృందం నమ్ముతోంది.
ఈ చిత్రం అక్టోబర్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త కథ, కొత్త కోణం, కొత్త దర్శకురాలు ఇవన్నీ కలిస్తే సినిమా వైవిధ్యంగా ఉండే అవకాశం ఉంది.
‘తెలుసు కదా’ సినిమా ఒక రొటీన్ ప్రేమకథ కాదని, ఒక కొత్త కోణం చూపిస్తుందని తెలుస్తోంది. ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Telusu Kada: ఎప్పుడు చూడని కొత్త పాయింట్ ని టచ్ చేశాం: శ్రీనిధి శెట్టి
‘తెలుసు కదా’గా వస్తోన్న తాజా ప్రేమకథా చిత్రంలో సిద్ధు జొన్నాలగడ్డ, రాశీ ఖన్నా, స్రినిధి శెట్టి నటిస్తున్నారు. దర్శకురాలిగా నీరజ కోన తొలిసారి పనిచేస్తున్నారు. వినోదంతో పాటు భావోద్వేగాలు, కొత్త ట్విస్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాగా రూపొందుతోంది.
Srinidhi Shetty
Telusu Kada: తెలుగు ప్రేక్షకుల కోసం మరో కొత్త ప్రేమకథ రానుంది. ‘తెలుసు కదా’(Telusu Kada Movie) అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాతో ప్రముఖ సెలెబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారుతున్నారు. ఇది ఆమెకు తొలి సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంలో సిద్ధు జొన్నాలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
సినిమాలో కొత్త ట్విస్ట్
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాయింట్ను టచ్ చేశాం. అయితే ఇప్పుడే ఆ విషయం చెప్పలేం. సినిమా చూడగానే ఆ విషయం తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు,” అంటూ ఆసక్తిని పెంచింది. అలాగే, ఈ సినిమా మొత్తం చూసే వరకు అసలు ఆ కీలక అంశం ఏమిటో తెలుసుకోలేమని చెప్పింది.
Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?
అలాగే, ‘తెలుసు కదా’లో అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి. కామెడీ, ప్రేమ, భావోద్వేగం.. అన్నీ సమపాళ్లలో ఉండేలా కథను రూపొందించారట. సినిమా అంతా ప్రేక్షకులకు సరదాగా సాగిపోతూ, చివరకు మంచి ఫీల్ని ఇస్తుందని చెప్పింది.
ఈ సినిమా తేలికగా అర్థమయ్యే కథతో సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. భావోద్వేగాలు మరీ ఎక్కువగా కాకుండా, మెల్లగా మనసును తాకేలా చూపించనున్నారట. ముఖ్యంగా యువతకు నచ్చేలా కథ, సంభాషణలు ఉంటాయని సమాచారం.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీ.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాకి సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఆయన సంగీతం ఇప్పటికే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని చిత్రబృందం నమ్ముతోంది.
ఈ చిత్రం అక్టోబర్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త కథ, కొత్త కోణం, కొత్త దర్శకురాలు ఇవన్నీ కలిస్తే సినిమా వైవిధ్యంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: హాలీవుడ్ మూవీలో 'సలార్' బీజీఎం.. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..!
‘తెలుసు కదా’ సినిమా ఒక రొటీన్ ప్రేమకథ కాదని, ఒక కొత్త కోణం చూపిస్తుందని తెలుస్తోంది. ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.