Siddu Jonnalagadda: డీజీ టిల్లు' సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టార్ బాయ్ హీరో సిద్దూ .. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే సిద్దూ ఇటీవలే నటించిన 'జాక్' మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. దీంతో నిర్మాతలకు కూడా భారీ నష్టం చేకూరుంది. ఈ మేరకు ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు సిద్దూ. తన రెమ్యునరేషన్ లో సగం పారితోషకాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించున్నాడు. ఈ సినిమా కోసం సిద్దూ రూ. 8కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. అందులో నుంచి రూ. 4కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సిద్దూ గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దూ - వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
.#SidduJonnalagadda returns half of his remuneration Rs 4.75crores to the producer @SVCCofficial @BvsnP as his previous film #Jack incurred losses. Heart Warming Gesture & Right Understanding Of Market Situations.
— BA Raju's Team (@baraju_SuperHit) June 4, 2025
His next #TelusuKada releasing on OCT 17th pic.twitter.com/qNfApGQTLV
'తెలుసు కదా'
ఇది ఇలా ఉంటే ప్రజెంట్ సిద్దూ లేడీ డైరెక్టర్ నీరజకోన దర్శకత్వంలో 'తెలుసు కదా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో సిద్దూ జోడీగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథనాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 17న విడుదల కానున్నట్లు తెలిపారు.
Also Read: Pakistan: 17 ఏళ్లకే హత్యకు గురైన ఈ సనా యూనఫ్ ఎవరు? ఆమె దేని కోసం ఫైట్ చేసింది?