Telusu Kada: ఇటీవలే 'జాక్' సినిమతో అలరించిన స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ డైరెక్టర్ నీరజకోన దర్శకత్వంలో 'తెలుసు కదా' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బిజీగా కొనసాగుతుంది. ఇందులో సిద్దూ జోడీగా రాశీ ఖన్నా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న సిద్దూ ఫ్యాన్స్ కి మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.
Two times the fun.
— People Media Factory (@peoplemediafcy) June 2, 2025
Two times the chaos.
And an infinite loop of love ❤️#TelusuKada - #LoveU2
Bringing the celebration early this Diwali 🎇#TelusuKada Grand Release Worldwide on October 17th ✨
STAR BOY #SiddhuJonnalagadda @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7… pic.twitter.com/ucc18cIIIL
రిలీజ్ డేట్
తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటన కూడా సిద్దూ తన స్టైల్లో బిన్నంగా చేశారు. ఇద్దరు హీరోయిన్లతో సరదాగా వీడియో కాల్ మాట్లాడుతూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.