/rtv/media/media_files/2024/11/24/jCulCh36vmswXOJ5GhO8.jpg)
'పుష్ప' మూవీతో సుకుమార్ కు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు రావడంతో ఆయన తదుపరి సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ డైరెక్టర్ త్వరలో 'పుష్ప2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే.. సుకుమార్ నెక్స్ట్ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి భాగం కానుందట. 'పుష్ప2' తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.
#RC17 will be a special film for #Sukumar as a director, as he’s exploring a concept never before seen in cinema. Pre-production and script work are currently in progress. pic.twitter.com/8o6LHnDA1e
— RC Addict 🚁 (@Its_Chanakya) November 4, 2024
చరణ్ కు జోడిగా..
'RC17' వర్కింగ్ టైటిల్తో మొదలయ్యే ఈ సినిమా కథకు సంబంధించిన కసరత్తులు కూడా మొదలయ్యాయని సమాచారం. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్తో సుకుమార్ ఈ కథను రెడీ చేస్తున్నారని తెలుస్తున్నది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో హీరోయిన్గా సాయిపల్లవిని అనుకుంటున్నారట.
RC - Sukku - SP 💥💥 🤩#RC17 #RamCharan #SaiPallavi pic.twitter.com/LSYVF0GviZ
— VenuCharan (@AlwysVenuCharan) November 19, 2024
అంతేకాదు త్వరలోనే ఆమెకు కథను కూడా వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు బలంగా ఉంటాయి. రామ్ చరణ్తో చేయనున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందట. అందుకే ఆ రోల్ కోసం సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు