COOLIE: సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న 'కూలీ' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు పైగా డీల్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్. ఇదే నిజమైతే.. తమిళ సినిమా చరిత్రలో 'కూలీ' సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఓవర్సీస్ లో అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలవనుంది.
Also Read: Pragra Jaiswal: వన్ పీస్ లో బాలయ్య బ్యూటీ థై షో.. కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేశాయి!
తెలుగులో కూడా భారీ హైప్
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రజినీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో 'జైలర్', 'లియో'చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులకు ₹50-60 కోట్ల వరకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఈ సినిమాలో ఉండడంతో ప్రేక్షకులను దృష్టిని మరింత ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Siddu Jonnalagadda: వావ్! సిద్దూ మనసు ఎంత మంచిదో.. సగం రెమ్యునరేషన్ నిర్మాతకే రిటర్న్
బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 350 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో రజినీ, నాగార్జున తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, తమిళ వెటరన్ సత్యరాజ్, శ్రుతి హాసన్, రేబా మోనికా జాన్, జూనియర్ ఎం.జి.ఆర్, మోనిషా బ్లెస్సీ వంటి స్టార్ తారాగణం కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Pakistan: 17 ఏళ్లకే హత్యకు గురైన ఈ సనా యూనఫ్ ఎవరు? ఆమె దేని కోసం ఫైట్ చేసింది?