'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ

'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని మూవీ టీమ్ తెలిపారు. 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ సెలవుల్లో సినిమాను బిగ్‌ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్‌ చేశారు.

New Update
pushpa ott

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.  

నార్త్ లో అయితే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేసే టైం కూడా వచ్చేసిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు వినిపించాయి.  'పుష్ప 2' జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుందని రూమర్స్ వచ్చాయి.

Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

అప్పటిదాకా థియేటర్స్ లోనే..

దీనిపై  మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. 'పుష్ప2' ఓటీటీ రిలీజ్‌పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. ఈ సెలవుల్లో సినిమాను బిగ్‌ స్క్రీన్‌పైనే ఆస్వాదించాలని ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా రిలీజైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో 'పుష్ప2' ఓటీటీకి వస్తోందన్న రూమర్స్‌కు చెక్ పడింది. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు