Kannappa: భారీ అంచనాలతో రూపొందిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఇన్నేళ్ల మంచు విష్ణు నిరీక్షణకు ఫలితం దక్కినట్లు తెలుస్తోంది. అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మంచు విష్ణు జోడీగా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగులో తొలి సినిమాతో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. 'నెమలి' అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది.
మొదటగా నపూర్
అయితే మొదటగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి నపూర్ సనన్ ని అనుకున్నారట. కానీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్ ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఊపందుకుంటున్న ప్రీతి 'కన్నప్ప' లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో భాగం కావడం ఆమెకి అదృష్టంగా మారింది. ఈ సినిమా విజయంతో ప్రీతికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/27/nuupur-sannon-2025-06-27-16-23-33.png)
ఇదిలా ఉంటే నపూర్ రవితేజ సరసన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆమె ఓ కీలకమైన పాత్రను పోషించింది. నపూర్ హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఫిల్హాల్' మ్యూజిక్ వీడియోతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో కొన్ని ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్