Pradeep Ranganathan: 'డ్రాగన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి క్రేజీ కాంబో!

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. #PR04 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ జంటగా 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు నటిస్తోంది.

New Update
#PR04 Pradeep Ranganathan

#PR04 Pradeep Ranganathan

Pradeep Ranganathan:  ఇటీవలే  'డ్రాగన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ప్రదీప్ తన కొత్త సినిమాను ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ్ లోమైత్రి మేకర్స్ నిర్మిస్తున్న రెండవ చిత్రమిది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల కానుంది.

Also Read: Ram Charan Bithday Special: వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్

గ్రాండ్ లాంచ్

ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, హీరో ప్రదీప్ రంగనాథన్, తమిళ స్టార్ శరత్ కుమార్, నటి మామితా బైజు, డైరెక్టర్ కీర్తిశ్వరన్ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా..  శరత్ కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా..  నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 

telugu-news | cinema-news | mamitha-baiju

Also Read: Chiyaan Vikram: ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా

Advertisment
Advertisment
తాజా కథనాలు