/rtv/media/media_files/2025/03/27/D7wRjOrRTSJpdDBz94xq.jpg)
#PR04 Pradeep Ranganathan
Pradeep Ranganathan: ఇటీవలే 'డ్రాగన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ప్రదీప్ తన కొత్త సినిమాను ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ్ లోమైత్రి మేకర్స్ నిర్మిస్తున్న రెండవ చిత్రమిది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల కానుంది.
Also Read: Ram Charan Bithday Special: వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్
గ్రాండ్ లాంచ్
ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, హీరో ప్రదీప్ రంగనాథన్, తమిళ స్టార్ శరత్ కుమార్, నటి మామితా బైజు, డైరెక్టర్ కీర్తిశ్వరన్ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Beginning the BANGER OF A PROJECT on an auspicious note ✨
— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2025
Clicks from the Pooja Ceremony of #PR04 ❤️🔥
Watch the highlights from the Pooja Ceremony. Don't miss the #FirstShot Boom at the end 💥💥
▶️ https://t.co/jJPJVBOEXE
Shooting in progress ❤🔥
⭐ing 'The Sensational'… pic.twitter.com/Ug7DibdQ8H
డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. శరత్ కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యాంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
telugu-news | cinema-news | mamitha-baiju
Also Read: Chiyaan Vikram: ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా