Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' పై.. చిరంజీవి, మోహన్ లాల్ ఏమన్నారంటే!

భారత దేశాన్ని గర్వపడేలా చేసిన 'ఆపరేషన్ సిందూర్' పై సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు కురిపిస్తున్నారు. చిరంజీవి, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, విజయ్ దేవరకొండ, రితేష్ దేశముఖ్ తదితరులు 'ఆపరేషన్ సిందూర్' కి మద్దతుగా ట్వీట్లు చేశారు. 

New Update
Operation Sindoor celebrities tweets

Operation Sindoor celebrities tweets

Operation Sindoor:  దేశ రక్షణలో మరోసారి భారత సైన్యం తన శౌర్యాన్ని చాటింది. పహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది.  'ఆపరేషన్  సిందూర్' పేరుతో ప్రతీకార చర్య చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి  1.44 గంటలకు కాశ్మీర్ PoK)లోని పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయగా.. 70 మందికి పైగా ఉగ్రవాదులను మరణించినట్లు సమాచారం.  

'ఆపరేషన్ సిందూర్'

ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పిన ఈ చర్యపై దేశవ్యాప్తంగా అభినందనల జల్లు కురుస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు భారత సైన్యం, ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సైన్యానికి మేమంతా మద్దతుగా ఉంటాము అంటూ ఎక్స్ పోస్టులు పెడుతున్నారు.  సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, విజయ్ దేవరకొండ, రితేష్ దేశముఖ్ తదితరులు 'ఆపరేషన్ సిందూర్' కి మద్దతుగా ట్వీట్లు చేశారు. 

మేము సింధూరాన్ని కేవలం సంప్రదాయంగానే కాకుండా మా అచంచలమైన సంకల్పానికి చిహ్నంగా ధరించాము.  భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్,  BSF  ప్రతి ధైర్య హృదయానికి సెల్యూట్ చేస్తున్నాను అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు. 

“జై హింద్” అంటూ సైన్యానికి సంఘీభావం తెలిపారు మెగాస్టార్ చిరంజీవి 

అల్లు అర్జున్ 'జస్టిస్ సర్వ్డ్' అంటూ పోస్ట్ పెట్టారు. 

ఉగ్రవాదం,  దాడులు అనే పదాలకు  ఉనికిలో లేని భవిష్యత్తు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జై హింద్ #ఆపరేషన్ సిందూర్ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 

“జై హింద్... భారత్ మాతాకీ జై” అంటూ ట్వీట్ చేశారు.

 latest-news | telugu-news | operation sindoor latest | celebrities on operation sindoor 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు