/rtv/media/media_files/2025/04/09/tLdLG5lAeRuhjGc5zcsm.jpg)
ntr tweet about pawan kalyan son
NTR: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురవడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. ''సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకోవడం ఎంతో బాధాకరం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్'' అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
అసలేం జరిగింది..
అయితే పవన్ కొడుకు మార్క్ సింగపూర్ లో చదుకుంటుండగా.. మంగళవారం స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో అతడి కాళ్లకు, చేతులకు గాయాలవడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మార్క్ సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కాస్త ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం మార్క్ ని ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. మరో మూడు రోజుల పాటు అతడిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు సమాచారం.
Also Read: Manchu Manoj: కత్తులు, గన్లతో మమ్మల్ని చంపేందుకు కుట్ర.. విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు!
సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు దంపతులు
కొడుకును చూసేందుకు పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ బయలుదేరారు. ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్, చిరంజీవి, సురేఖలు కనిపించారు. అక్కడకు వెళ్ళాక మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన, మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. కొడుకు పరిస్థితి మెరుగుపడే వరకు పవన్ అక్కడే ఉండనున్నట్లు సమాచారం.
Also Read: BIG BREAKING: తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!