Robinhood Ott వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రాబిన్హుడ్'. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి దాదాపు రూ. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ. 8 కోట్లు రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.
ఓటీటీ అప్డేట్
అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ విడుదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5 ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. మే 10 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి రానుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించి అలరించారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్త నాగే, షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, కేశవ్ దీపక్, మైమ్ గోపి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#Nithiin’s #Robinhood OTT and TV premiere date –
— MOHIT_R.C (@Mohit_RC_91) April 29, 2025
ZEE Telugu has announced that the film’s television premiere is coming soon.
Robinhood is set to premiere on both ZEE5 and ZEE Telugu TV on May 10, 2025. An official confirmation is expected shortly. pic.twitter.com/sKI1NxjqmG
మైత్రీ మూవీ మేకర్స్కు బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే నితిన్ ప్రస్తుతం 'తమ్ముడు' సినిమాతో చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా మూవీ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.
latest-news | cinema-news