/rtv/media/media_files/2025/02/10/oXK51Cl3J3MxCHDi6ciq.jpg)
nagarjuna thandel success meet
Thandel Success Meet: అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'తండేల్ ' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు ప్రకటించారు. 'లవ్ సునామీ సెలెబ్రేషన్స్ విత్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున' అంటూ పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటికే నాగార్జున 'ప్రౌడ్ ఆఫ్ యు మై సన్' చైతన్యను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సినిమా సక్సెస్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
A ROYAL EVENT for the #BlockbusterLoveTsunami ❤️🔥#Thandel LOVE TSUNAMI CELEBRATIONS with the one and only KING @iamnagarjuna Garu as the chief guest 🤩👑
— Geetha Arts (@GeethaArts) February 10, 2025
On 11th February from 5 PM onwards. Stay tuned 🌊
▶️ https://t.co/x6gjDwDd5N
Book your tickets for the DHULLAKOTTESE… pic.twitter.com/uf9N8A4DF8
మత్స్యకారుల కథతో
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారుల నిజ జీవిత సంఘటనలు చెబుతూ.. అలాగే దానికి ఒక చక్కటి లవ్ స్టోరీని జోడించి
రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నాగచైతన్య కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తొలి చిత్రమిది. చై- సాయి పల్లవి కెమిస్ట్రీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. చైతన్య- సాయి పల్లవి కాంబోలో 'లవ్ స్టోరీ' తర్వాత 'తండేల్' సెకండ్ బ్లాక్ బస్టర్.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!