Drishyam 3: మోస్ట్ అవైటెడ్ మలయాళ సీక్వెల్ 'దృశ్యం 3' కి సంబంధించి నటుడు మోహన్ లాల్(actor-mohan-lal) అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి సినిమాను షూటింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నటుడు మోహన్ లాల్ ఇన్స్టా వేదికగా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ''గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు.. ‘దృశ్యం 3’ వచ్చేస్తోంది'' అంటూ క్యాప్షన్ జోడించారు.
Also Read: Subhashree: బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ సంగీత్ లో సింగర్ భోలే రచ్చ రచ్చ! వీడియో వైరల్
భారీ అంచనాలు
దృశ్యం ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన దృశ్యం 1, 2 సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. దీంతో 'దృశ్యం 3'పై మోహన్లాల్ అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మూడవ భాగంలో జార్జ్ కుట్టి, తన కుటుంబానికి సంబంధించిన కేసును ఎలా ముగిస్తాడు? అనేది ప్రధాన అంశంగా ఉండబోతున్నట్లు సమాచారం. 'దృశ్యం 2' విడుదలై మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో 'దృశ్యం 3' అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. 'దృశ్యం' లో మోహన్ లాల్, ఆశా శరత్, సిద్దిఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తొలి చిత్రంగా రికార్డ్
దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం వివిధ భాషల్లో రీమేక్ అవడంతో పాటు.. ప్రతి భాషలోనూ అద్భుత విజయాన్ని సాధించింది. దాదాపు 5 కి పైగా భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. తెలుగులో, హిందీ మలయాళ భాషల్లో 'దృశ్యం' పేరుతో, కన్నడలో 'పాపనాశం' పేరుతో తెరకెక్కింది. అంతేకాదు హాలీవుడ్ లో రీమేక్ అయిన తొలి చిత్రంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: Ananya Nagalla : కేరవాన్లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల