Athidi Re Release: రీ-రిలీజ్ కి రెడీ అయిన మహేష్ బాబు అట్టర్ ఫ్లాప్ మూవీ..

SSMB29 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌గా, అతిథి సినిమా మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా థియేటర్లలో మళ్లీ విడుదలకానుంది. దీనితో ఈ మూవీ రీ-రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

New Update
Athidi Re Release

Athidi Re Release

Athidi Re Release: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా SSMB29తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మహేష్ పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో, మహేష్ ఫ్యాన్స్‌కి మరో స్పెషల్ ట్రీట్ సిద్ధమైంది.

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి (మే 31) సందర్భంగా, మహేష్ బాబు నటించిన ‘అతిథి’ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమృతా రావు హీరోయిన్‌గా నటించింది.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో యావరేజ్ గా  నిలిచింది. కానీ, ఇప్పుడు మహేష్ బాబు క్రేజ్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో, రీ-రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

మహేష్ అభిమానులు తమ హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఉత్సాహంలో ఉన్నారు. మరి 'అతిధి' రీ-రిలీజ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి!

Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Saiyami Kher : ఆఫర్ ఇస్తా నాతో పడుకోవాలన్నాడు.. తెలుగు డైరెక్టర్ పై నాగార్జున హీరోయిన్‌ సంచలన కామెంట్స్!

నటి సయామి ఖేర్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్‌మెంట్‌ అడిగారని చెప్పారు. అలాంటి ఆఫర్‌ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని నటి సయామి ఖేర్ వెల్లడించింది.

New Update
Nagarjuna-heroine

నటి సయామి ఖేర్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్‌మెంట్‌ అడిగారని బాలీవుడ్ బబుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  ఒక తెలుగు సినిమాలోని పాత్ర కోసం వారి ఏజెంట్‌ తనకు ఫోన్‌ చేసిందని, అవకాశం కోసం కాంప్రమైజ్‌ అవ్వాలని చెప్పిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఓ  మహిళ అయి ఉండీ కూడా ఆమె తనని ఇలా అడగడం చూసి షాక్ అయ్యానని అన్నారు. 

ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశా

అలాంటి ఆఫర్‌ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని నటి సయామి ఖేర్ వెల్లడించింది. అయితే అ తెలుగు డైరెక్టర్ ఎవరూ అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్‌ లో దుమారం రేపుతున్నాయి. కాగా సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన రేయ్‌ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లోకి ఏంట్రీ ఇచ్చింది సయామి ఖేర్.

తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో

 ఆ తరువాత నాగార్జునతో వైల్డ్ డాగ్, ఆనంద్‌ దేవరకొండ హైవే చిత్రాలలో నటించింది.  ఆమె నటించిన చిత్రాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేసుకుంటోంది.   ఇటీవలే ఆమె సన్నీ డియోల్‌ `జాట్‌`లో ఎస్‌ఐ విజయ లక్ష్మిగా కీలక పాత్రలో నటించింది.  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సయామి దివంగత నటి ఉషా కిరణ్ మనవరాలు

Advertisment
Advertisment
Advertisment