/rtv/media/media_files/2024/11/06/IS08GOh11vo5S3HGPxur.jpg)
20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ తాజాగా తమ బ్యానర్ లో రాబోతున్న ఫస్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ మూవీకి 'లగ్గం టైమ్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
Aslo Read: ఇచ్చిన మాట ప్రకారం పవన్ అడుగులు.. పిఠాపురంలో మరో 12ఎకరాలు
మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపిన సాగర్ కె చంద్ర.. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేసే సినిమాలా దీనిని తీస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. రాజేష్ మేరు, నవ్య చిత్యాల మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Here is the first look poster of #LaggamTime, set to redefine storytelling with a cinematic love story like never before.💖✨
— Aditya Music (@adityamusic) November 6, 2024
Poster launch by the director @saagar_chandrak ▶ https://t.co/fIeoAsJQkp@Rajeshmeru #NavyaChityala @i_Prajoth #KHimaBindu #Pavan #NelloreSudharshan… pic.twitter.com/jtRZdcti2g
Also Read : రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?
ప్రజోత్ కె వెన్నం కథ అందించడంతో పాటూ దర్శకతం వహిస్తున్నారు. కె.హిమ బిందు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా పవనే అందిస్తుండటం విశేషం. కాగా ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ను ఆదిత్య మీడియా సంస్థ కొనుగోలు చేసింది.
Also Read : స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ పై లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్..!