Kangana Ranaut: ఆదాయం రూ.50.. ఖర్చు రూ.15 లక్షలు.. నా బాధ అర్థం చేసుకోండి: కంగనా

హిమాచల్‌లో వరదల వల్ల కంగనా ప్రారంభించిన రెస్టారెంట్‌కు తీవ్ర నష్టం కలిగింది. ఒకరోజు కేవలం ₹50 ఆదాయం మాత్రమే వచ్చిందని, కానీ నెలకు ₹15 లక్షల జీతాలు చెల్లించాల్సి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ వరదల(Himachal Pradesh Floods)పై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మనాలీలో ప్రారంభించిన ఆమె రెస్టారెంట్‌ “ది మౌంటెన్ స్టోరీ” ప్రస్తుతం వరదల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆమె “నా రెస్టారెంట్ ఆదాయం నిన్న కేవలం రూ.50 మాత్రమే వచ్చింది. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. నా బాధను అర్థం చేసుకోండి.” అంటూ స్పందించారు.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

400కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు..

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌లు(Himachal Pradesh Cloud Burst), కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. జూన్ 20 తర్వాత వచ్చిన వరదల కారణంగా ఇప్పటికే 400కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కంగనా తన నియోజకవర్గమైన మండి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు.

Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!

సోలాంగ్, పల్చన్ ప్రాంతాల్లో పర్యటించిన కంగనాకు స్థానికులు తమ ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. బియాస్ నది గట్టులను కొండచరియలు కొట్టిపడేయడంతో, గ్రామాలు ప్రమాదానికి లోనవుతున్నాయని చెప్పారు. నదీ ప్రవాహాన్ని మళ్లించాలన్నదే గ్రామస్తుల అభిప్రాయం.

Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?

ఈ సందర్భంగా కంగనా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, “ఇప్పుడంతా కష్ట సమయంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ట్రోలింగ్‌లు చేయకుండా మనుష్యత్వంతో స్పందించండి. నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. చిన్న వ్యాపారాలను గౌరవించండి” అని ఆమె అన్నారు.

Advertisment
తాజా కథనాలు