/rtv/media/media_files/2025/04/17/nftSJSsVRvI1AMTEaD8u.jpg)
Karthik Subbaraj
Karthik Subbaraj: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఒక వార్త.. అదేంటంటే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) మళ్లీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో జట్టుకట్టబోతున్నారని! ప్రస్తుతం కూలి, జైలర్ 2 సినిమాలతో బిజీగా ఉన్న రజినీ, ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సుబ్బరాజ్తో కలిసి పని చేయనున్నట్లు సమాచారం.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
2019లో వచ్చిన పేట చిత్రం ద్వారానే ఈ ఇద్దరి కాంబో మొదలైంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా, పేట రజినీ అభిమానులకు మంచి ఫీస్ట్లా అనిపించింది. తమిళంలో మోస్తరు విజయం సాధించిన ఈ మూవీ, తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమాతోనే కార్తీక్కు స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
సూర్యతో కార్తీక్ సుబ్బరాజ్ కొత్త ప్రయోగం
పేట తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ ధనుష్, విక్రమ్ లాంటి స్టార్లతో సినిమాలు చేశారు. తాజాగా సూర్యతో కలిసి ఒక రెట్రో బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు సూర్యకు చెందిన 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
రజినీ- సుబ్బరాజ్ కాంబో మళ్లీ రిపీట్..?
ఇప్పటికే కూలీ సినిమాను లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తుండగా, జైలర్ 2కు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్నాయి. కూలి చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
ఈ రెండు భారీ సినిమాల తర్వాత రజినీకాంత్- కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇద్దరూ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్పై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికి, సూపర్ స్టార్ రజిని- క్రియేటివ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తే, అభిమానులకు మరోసారి పండుగే!