'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అందులో నిజం లేదంటూ

'దేవర' కలెక్షన్స్ పై 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న 'దేవర'కు అత్యధిక గ్రాస్‌ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచేనని, మేం అయితే ఒరిజినల్‌ నంబర్స్‌ మాత్రమే తెలియజేశామని అన్నారు.

New Update
naga vamsi

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన  'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సో కలెక్షన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీతో ఎన్టీఆర్ కు సోలో పాన్ ఇండియా హిట్ పడిందనే చెప్పాలి. 

ఈ సక్సెస్ ను అటు మూవీ టీమ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దసరా హాలిడేస్ ఉండటంతో సినిమాకు మరింతగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే 'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన నిర్మించిన 'లక్కీ భాస్కర్' మూవీ ప్రెస్ మీట్ లో 'దేవర' కలెక్షన్స్‌ నిజమేనా? అనే ప్రశ్న ఎదురైంది. 

Also Read : 'విశ్వంభర' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ

ఫ్యాన్స్‌ కోసమే అలా..

దీనికి నాగవంశీ బదులిస్తూ.." 'దేవర'కు అత్యధిక గ్రాస్‌ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం అయితే ఒరిజినల్‌ నంబర్స్‌ మాత్రమే తెలియజేశాం. సినిమా కలెక్షన్స్‌ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్‌ కోసమే. వాళ్లు సంతోషంగా ఉంటే మేము కూడా ఆనందంగా ఉంటాం. ఈ సంస్కృతి ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమా సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్‌ చేశానని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు.." అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు