Hyderabad : మాయదారి మాంజాలు అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు నిషేధం విధించినప్పటికీ మాంజా దారం విచ్చల విడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా చైనా మాంజా విక్రయం, వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అయినా కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో చైనా మాంజా విక్రయాలు గుట్టుగా సాగిస్తున్నారు. ప్రాణాంతకంగా మారుతున్నా చైనా మాంజా.. కలిగే అనర్థాలను కళ్లారా చూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈ మాంజా దారం తెగి ఆర్మీ జవాన్ (Army jawan) మృతి చెందిన భయంకరమైన ఘటన లంగర్ హౌస్ (Langar House) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తిగా చదవండి..Hyderabad: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు
మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Translate this News: