సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఎవరంటే

హర్యాణా ముఖ్యమంత్రి లాల్ ఖట్టర్ సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వెళ్లారు. టోపీ పెట్టుకొని, ముఖానికి తువ్వాలు కట్టుకుని పంచకులలోని సెక్టార్-5 లోని ఓ మైదానంలో జరుగుతున్న మోళాకు వచ్చిన ఆయన.. ఆ ప్రాంతమంతా తిరిగారు.

New Update
సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఎవరంటే

ముఖ్యమంత్రి అంటేనే అతడు ఆ రాష్ట్రానికి పెద్ద నాయకుడు. ఆయన బయటకు వస్తే.. వెంట కాన్వాయ్ ఉంటుంది. కట్టుదిట్టంగా భద్రతా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తిలాగా జనం మధ్యలోకి వెళ్లడాన్ని ఎప్పుడైన చూశారా. హర్యాణాకు చెందిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మారువేషంలో జనం మధ్యలోకి వచ్చేశారు. పంచకులలోని సెక్టార్-5 లో ఉన్న ఓ మైదానంలో జరుగుతున్న మేళాలో ఆయ కాసేపు సాధారణ వ్యక్తిలాగా జనాల మధ్యే తిరిగారు. టోపీ పెట్టుకుని, మాస్క్ ధరించి.. ముఖానికి తువ్వాలు కట్టుకుని ఆ ప్రదేశంలో కొద్దిసేపు నిలబడ్డారు.

Also Read: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం

ఆ తర్వాత తినుబండారాలు కొనుక్కోని ఆ ప్రాంతమంతా తిరిగారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది కూడా లేరు. అయితే.. ఆయన ఎందుకోసం ఇలా సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వచ్చారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

Also Read: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు