స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు భవితవ్యం నేడు తేలిపోనుంది. సెక్షన్ 17ఏ ప్రకారం తన మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున నేటి మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ తన వాదనలను కొనసాగిస్తారు. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి విన్నవించారు. ముకుల్రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. అవి ముగిసిన తర్వాత ధర్మాసనం ఈరోజే తీర్పు చెబుతుందా..లేక తీర్పును రిజర్వ్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. వాదనలు ముగిసే సమయం, కోర్టు సెషన్స్ ఎండ్ టైమ్ లాంటి వాటి మీద ఆధారంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంటుంది.
పూర్తిగా చదవండి..Chandrababu:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు.
Translate this News: