Gujarath: గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం

గుజరాత్‌ లో చండీపురా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎనిమిది మంది చిన్నారులతో కలిపి ఇప్పటికి పధ్నాలుగు మంది ఈ వైరస్‌తో చనిపోయారు.

New Update
Gujarath: గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం

Chandipura Virus: గుజరాత్‌లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ వైర్ బారిన పడుతున్నారు. ఈరోజు ఇద్దరు చిన్నారులు దీని కారణంగా మరణించారు. దీంతో గుజరాత్‌లో చండీపురా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 14కు చేరంది. ఇందులో ఎనిమిది మంది చిన్నారులే ఉన్నారు. సబర్‌కాంత, ఆరావళి, మహిాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్‌ జిల్లాల్లో చంీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

రాజస్థాన్ నుంచి రెండు కేసులు, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక కేసు గుజరాత్‌లోనే చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. రాజస్థాన్‌కి చెందిన ఇద్దరు రోగుల్లో ఒకరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ డిపార్ట్మెంట్‌ని హై అలర్ట్ చేశామని, చండీపురా వైరస్ కేసులను గుర్తించేందుకు కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. దాంతోపాటూ
ముందుజాగ్రత్తగా 26 రెసిడెన్షియల్ జోన్లలోని 8600 ఇళ్లలో 44,000 మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. చండీపురా వైరస్ జ్వరాన్ని కలిగిస్తుంది, ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)ని కలిగిస్తుంది. ఇది దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

Also Read:Andhra Pradesh: 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకయ్యచౌదరి

Advertisment
తాజా కథనాలు