Chandipura Virus : భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి
గుజరాత్లో చాందీపుర వైరస్ బారినపడి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.