Andhra Pradesh:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ టీమ్‌ పర్యటన కొనసాగనుంది.

Andhra Pradesh:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన
New Update

Election commission:కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు చేరుకుంది. ఈరోజు నుంచి రేపు ఏపీలో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar), ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే(Anoop Chandra Pande), అరుణ్ గోయల్(Arun Goel)లు ఇందులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన చేస్తోంది. దానితో పాటూ ఓటర్ల జాబితాలో అవకతవకల విషయాన్ని కూడా పరిశీలించనుంది. ఈ రాత్రికి విజయవాడకు ఎన్నికల అధికారుల బృందం చేరుకుంటుంది.

Also Read:విజయవాడలో టీచర్ల మహాధర్నా

రాజకీయ పార్టీలతో సమావేశం..

ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 12 వరకు రాజకీయ పార్టీలతో సమావేశం అవుతుంది. ఇందులో బాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లను కలవనున్నారు. తరువాత మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం సమీక్షిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఓటర్ల(Voters) జాబితాలో అవకతవకలు, పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష చేయనుంది సీఈసీ.. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఓటర్ల జాబితాలో గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ప్రకటించామని తెలిపారు.

ఎన్నికల సన్నద్ధతపై ప్రెజెంటేషన్...

దీని తర్వాత ఎల్లుండి అంటే 10వ తేదీన సీఈవో ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు . ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఎన్నికల కమిషన్…కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఈసీ భేటీ కానుంది. చివరగా 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం నిర్వహించి..అదే రోజు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది కేంద్ర ఎన్నికల బృందం.

బదిలీలు, పోస్టింగ్‌లు…

మరోవైపు రెండు,మూడు నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించవద్దని స్పష్టం చేసింది. 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యేవారిని కొనసాగించొద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించింది. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను 2024 జనవరి నెలాఖరుకి పూర్తిచేసి, నివేదికను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

#vijayawada #andhrapradesh #cec #elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe