Mahindra New Car: మహీంద్రా భారతీయ మార్కెట్లోకి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసి, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో గట్టి హడావిడి సృష్టించింది. డిజైన్, పనితీరు పట్ల వినియోగదారులు ఈ రెండు కార్లను బాగా ఇష్టపడుతున్నారు. Tata, Hyundai, MG వంటి పెద్ద కంపెనీల నుంచి ఇలాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడం విశేషం.
Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ SUVలలో డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ను అందించింది. డాల్బీ అట్మోస్ సిస్టమ్ ద్వారా భారతీయ కస్టమర్లకు ప్రీమియం మ్యూజిక్ అనుభవం లభిస్తుంది.
Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు
హై-ఎండ్ ఆడియో సెటప్:
ఈ రెండు SUVల్లో 16 హర్మాన్ కార్డాన్ స్పీకర్లతో ప్రీమియం ఆడియో సెటప్ ఉంది. ముందు సీట్లలో ట్వీటర్, మిడ్-రేంజ్ డ్రైవర్, వూఫర్ వంటి త్రి-వే స్పీకర్లు ఉండగా, వెనుక సరౌండ్ స్పీకర్లు మధ్య-శ్రేణి ధ్వనిని అందిస్తాయి. సబ్వూఫర్, రెండు సీలింగ్-మౌంటెడ్ స్పీకర్ డ్రైవర్లతో ఆడియో అనుభవాన్ని మరింత పెంచింది. డాల్బీ అట్మోస్ తో భారతీయ కస్టమర్లు ఎలక్ట్రిక్ SUVలలో ఇంత ఆధునిక సాంకేతికతను చూడటం ఇది మొదటిసారి.
Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు
ధర & వేరియంట్లు:
మహీంద్రా BE 6 బేస్ వేరియంట్ ధర రూ.18.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, XEV 9e ప్రారంభ ధర రూ.21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలు INGLO ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారయ్యాయి. జనవరి 2025లో ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభమవుతాయి, అయితే డెలివరీలు 2025 ఫిబ్రవరి చివర్లో ప్రారంభం అవుతుంది.