Telangana: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు..!

తెలంగాణలో గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారు. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్‌ కానున్నారు.

New Update
Telangana: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్‌ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు గడ్డం ప్రసాద్‌ నామినేషన్ వేస్తారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. గడ్డం ప్రసాద్ ప్రసాద్ తన నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. రేపు ఈయన అసెంబ్లీలో స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్‌ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు